హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు పొంచి ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ సందర్భంలో 891 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మారిన డిశ్చార్జ్ డిజైన్తో ముంపు మరింత ఉండనుందని, మణుగూరులోని భారజల విద్యుత్తు కేంద్రానికి ప్రమాదం ఏర్పడే ఆస్కారం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తి శాఖకు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్ గురువారం ప్రత్యేక లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంపై తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల ఇరిగేషన్ అధికారులు, సాంకేతిక నిపుణులతో కేంద్ర జల్శక్తి కార్యదర్శి పంకజ్కుమార్ ఈ నెల 7న ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ వాదనలతో సీడబ్ల్యూసీ ఏకీభవించడంతోపాటు, పోలవరం బ్యాక్వాటర్ వల్ల నీళ్లు నిలిచిపోతాయని అంగీకరించింది. గోదావరికి ఇరువైపులా అన్ని ప్రధాన ప్రవాహాలను కవర్ చేస్తూ జాయింట్ సర్వే చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు సంబంధించిన వివరాలను 19వ తేదీలోగా ఇవ్వాలని సూచించగా, గురువారం సీడబ్ల్యూసీకి అందజేసింది.
సీడబ్ల్యూసీకి అందించిన వివరాలు..