వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు గురువారం ఒక్క రోజే 50 వేల ఎండు మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో మిర్చియార్డుతోపాటు పల్లి, పసుపు, పత్తి యార్డులన్నీ మిర్చి బస్తాలతోనే నిండిపోయాయి.
ప్రస్తుత మిర్చి సీజన్ జనవరి నుంచి ప్రారంభం కాగా.. సీజన్ ప్రారంభంలో ప్రతి రోజు వెయ్యి నుంచి 10 వేల బస్తాలు వచ్చాయి. మార్కెట్కు పెద్ద ఎత్తున మిర్చి రావడంతో రైతులు, వివిధ కార్మికులు, అడ్తి, ఖరీదు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.