340 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం
హైదరాబాద్, మార్చి 7 : హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు అదనంగా రీజినల్ రింగ్ రోడ్ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు జిల్లాల నుండి హైదరాబాద్కు ఈ రింగ్రోడ్డు ద్వారా మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల ఆవల 340 కిలోమీటర్ల పొడవుతో ట్రిపుల్ ఆర్ నిర్మాణం కానున్నది. ఈ రోడ్డు నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది.