Komuravelli | సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల్లో నేడు ఐదో ఆదివారం కావడంతో దాదాపు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఎటుచూసినా జన సందోహం కనిపించింది.
భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, ఒడిబియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో ఎ.బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి,కమిటీ సభ్యులు,అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది భక్తులకు సేవలు అందించారు.