హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల డైరెక్టర్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శనివారం జరిగిన మీడియాతో సమావేశంలో విద్యుత్తు బీసీ ఉద్యోగుల అసొసియేషన్ నేతలతో కలిసి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు కల్పించకపోతే విద్యుత్తు సంస్థల కార్యాలయాల గేట్లకు తాళాలేస్తామని హెచ్చరించారు. డైరెక్టర్ల వయో పరిమితిని కూడా 65 ఏం డ్లకు పెంచాలని కోరారు. సంస్థలో బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఉన్నతస్థాయి హోదా ల్లో బీసీ అధికారులు నామమాత్రంగానే ఉన్నారని పేర్కొన్నారు. పదోన్నతుల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కో రారు. సమావేశంలో బీసీ సంక్షేమ సం ఘం నేత గుజ్జ కృష్ణ, విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, తదితరులు పాల్గొన్నారు.