హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య శుక్రవారం ఒక ప్రకటనలో సీఎం రేవంత్రెడ్డిని కోరారు. కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, మారెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, ఇతర నామినేటె డ్ పదవుల్లో జనాభా ప్రకారం బీసీలకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో సమర్థులైన బీసీ నేతలు ఉన్నారని, వారి సేవలకు గుర్తింపును ఇవ్వాలని కోరారు. రాహుల్గాంధీ బీసీలకిచ్చిన హామీలు, ఉదయపూర్ డిక్లరేషన్ను అమలు చేయాలని కోరారు. ఇటీవల నలుగురు ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరు కూడా బీసీలు లేకపోవడం సరికాదని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ.20 వేల కోట్ల నిధులను కేటాయించాలని కోరారు.