హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ. 5 కే భోజన కార్యక్రమం ప్రారంభమైందన్నారు. గాంధీ ఆస్పత్రిలో రోగి సహాయకులకు రూ. 5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోగుల సహాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బయట హోటల్స్లో భోజనం చేయాలంటే రోజుకు రూ. 500 దాకా ఖర్చు వస్తుందన్నారు. రూ. 5 కే భోజనం అందివ్వడం గొప్ప విషయమన్నారు. కేసీఆర్ సార్కు చాలా పుణ్యం వస్తుందని అక్కడున్న మహిళలు పేర్కొన్నారు.
పేదలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూనే, రోగులకు, వారి సహాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
గాంధీ ఆస్పత్రిలో రూ. 5 కే భోజనం కార్యక్రమం ప్రారంభం.. రోగి సహాయకులకు రూ. 5 కే భోజనం అందివ్వడంతో కేసీఆర్ సార్కు చాలా పుణ్యం వస్తుందన్న మహిళలు. pic.twitter.com/Gv5HPX461l
— Namasthe Telangana (@ntdailyonline) May 12, 2022