కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుం డటంతో ప్రాజెక్టులోకి సోమవారం ఇన్ఫ్లో భారీగా పెరిగింది. ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్నం వరకు 8374 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం ఇన్ఫ్లో 13178 క్యూసెక్కులకు పెరిగింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు ఇన్ఫ్లోను ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు 2 ,4, 7, 8, 11వ నంబరు క్రస్టు గేట్లను ఒక్కో గేటును ఐదు అడుగుల మేర ఎత్తి 12938.74 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
కుడి, ఎడమ కాలువలకు కలిపి 144.72 క్యూసెక్కుల నీరు వెళుతుంది. మొత్తం 13178.66 క్యూసెక్కుల ఔట్ఫ్లో వెళుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.60(4.09 టీఎం సీలు) అడుగులుగా ఉన్నట్లు ఏఈ ఉదయ్ తెలిపారు. మూసీకి వరద ఉధృతి పెరగడం తో పరివాహక ప్రాంత రైతులు ఎవరూ నదిలోకి వెళ్లవద్దని ఏఈ విఙప్తి చేశారు.