Corona | వరంగల్ చౌరస్తా/జ్యోతినగర్, డిసెంబర్ 30: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు వచ్చిన ఐదుగురు చిన్నారులను పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
ఇందులో నలుగురిది ఒకటి నుంచి రెండేండ్ల మధ్య వయస్సే. నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో హోం ఐసోలేషన్కు పంపారు. ఒక్కరిని మాత్రమే అడ్మిట్ చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ టౌన్షిప్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.