హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ)/తాంసి(తలమడుగు): పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం వరకు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ వివిధ విభాగాల అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి రూ.46.61 లక్షల నగదును పట్టుకున్నారు. వీటితోపాటు రూ.6.23 లక్షల విలువ గల వివిధ రకాల వస్తువులను సీజ్ చేసినట్టు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఫణీందర్ తెలిపారు.