మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి 2.55 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 45 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.76 మీటర్ల వద్ద ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 9.65 టీఎంసీలు. ఇప్పుడు 8.14 టీఎంసీలుగా ఉంది.