హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి సం దర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి ఈ నెల 15 వరకు 4,484 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. వాటిలో 626 బస్సు సర్వీస్లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ప్రత్యేక బస్సుల ఏర్పా టు, మహాలక్ష్మి పథకం అమలు, సౌకర్యాలపై హైదరాబాద్ బస్భవన్లో శుక్రవారం ఆయన సమీక్షించారు. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని వివరించారు. సంక్రాంతి పండుగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమలులో ఉంటుందని వివరించారు.