హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఒడిశా నుంచి హైదరాబాద్కు ప్రైవే ట్ ట్రావెల్స్లో అక్రమంగా తరలిస్తున్న 41.01 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. గంజాయి విలువ సుమారు రూ.20.5 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆదివారం రాచకొండ నారోటిక్స్ పోలీస్స్టేషన్ బృం దం, ఖమ్మంలోని ఈగల్ ఫోర్స్ రీజినల్ నారోటిక్స్ కంట్రోల్ సెల్ సహకారంతో ఆటోనగర్ సమీపంలోని మహావీర్ వనస్థలి నేషనల్ పార్ వద్ద అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ‘బాబా భోలేనాథ్’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.