హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇప్పటి వరకు రూ.40 వేలకోట్లకు పైగా సాయం అందించినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు తెలిపారు. గురువారం రే అగ్రి కన్సల్టెన్సీ నిర్వహించిన అగ్రి బిజినెస్ సమ్మిట్లో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న రైతు కేంద్రక నిర్ణయాల వల్ల గడిచిన ఏడేండ్లలో రాష్ట్రంలో 40% మేర సాగు విస్తీర్ణం పెరిగిందని వివరించారు. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రభు త్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పత్తి చేయడం నేటి అవసరమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. ఇఫ్కో ఎండీ యూఎస్ అవస్థీకి, సల్ఫర్ మిల్స్ సీఎండీ దీపక్ షాకు జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు.