హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): జూబ్ల్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ తరపున ప్రచారం చేయడానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లను బీఆర్ఎస్ నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ అధిష్ఠానం ప్రచారంలో పాల్గొనే ముఖ్య నేతల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం ఆమోదం తెలిపింది.
బీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ సోమభరత్కుమార్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు ఈ 40 మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సీఈవో అనుమతి పాస్లు మంజూరు చేసింది. స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం నవంబర్ 9న సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, టీ పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, వీ శ్రీనివాసగౌడ్, ఎస్ నిరంజన్రెడ్డి, టీ జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్కుమార్, శంభీపూర్ రాజు,
పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తాతా మధుసూదన్, ఎల్ రమణ, తక్కెలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, డీ సుధీర్రెడ్డి, ముఠాగోపాల్, డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్జాదవ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్థన్రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, పార్టీ నేతలు రావుల శ్రీధర్రెడ్డి, షేక్ అబ్దుల్లా సొహైల్ ఉన్నారు.