హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ లోని వీరశైవ లింగాయత్, లింగ బలిజసహా తెలంగాణలోని 40 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చా లని రాష్ట్ర ఎంపీలు బీబీ పాటిల్, ఆర్ కృష్ణయ్య, కే లక్ష్మణ్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణకు సంబంధిత అధికారులతో కలిసి వారు హాజరయ్యారు. ఆయా కులాలకు సంబంధించిన ఆధారాలను జాతీయ బీసీ కమిషన్కు వారు సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్ వెనుకబడిన కులాలపై లోతుగా అధ్యయనం చేసి వారి స్థితిగతులను తెలు సుకొని ఇప్పటికే పలుమార్లు నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఆయా బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంపై ముందడుగు పడటం లేదని వారు గుర్తు చేశారు. 14 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యో గాల్లో, విద్యా అవకా శాల్లో, కేంద్ర పథకాల్లో ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతున్న దని వివరించారు. ఆయా కులాలకు ఓబీసీ జాబితాలో చేర్చే విషయమై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఎన్సీబీసీ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహీర్ తెలిపారు.