హైదరాబాద్: హైదరాబాద్లోని అడిక్మెట్లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అడికెట్మెట్ ఫ్లైఓవర్పై ఓ బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులను కామారెడ్డికి చెందిన భవన్ (20), నిర్మల్కు చెందిన రోషన్ (20)గా గుర్తించారు. మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించారు. మృతులిద్దరు ఓ డిగ్రీ కాలేజీలో బీబీఏ చదువుతున్నారని, కళాశాలకు వెళ్తుంగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
నిర్మల్: జిల్లాలోని సోన్ మండలంలోని కడ్తాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని గర్తు తెలియని వాహనం వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతులు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అమీర్(22), బషీర్(22)గా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ నుంచి నిర్మల్కు వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.