గోదావరిఖని, మార్చి 28: రైతు సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఈ నెల 30న పెద్దపల్లిలో 36 గంటల నిరసన దీక్ష చేపడుతున్నట్టు నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కారు రైతుకేంద్రంగా పనిచేసిందని అన్నారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో చుక్కలు చూపించాలని అన్నారు.సీఎం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాష్ర్టాన్ని గాలికొదిలేశాడని దుయ్యబట్టారు.