నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగున భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 1,94,200 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1087.70 అడుగులు ఉన్నది. ప్రాజెక్టులో మొత్తంగా 90.30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే ఇప్పుడు 75.46 టీఎంసీ నీరు ఉన్నది.
ఇక ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఉదయం 6 గంటలకు 62.71 అడుగులు వద్ద నీటిమట్టం ఉన్నది.