మహబూబ్నగర్: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి జూరాలకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 1.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 అడుగులు కాగా, ఇప్పుడు 318.16 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 8.92 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో ఉన్న సుంకేసులు ప్రాజెక్టుకు 1,68,972 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 27 గేట్లు ఎత్తి 1,66,707 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.