హైదరాబాద్: సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 32,818 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. Drunk and driveలో పట్టుబడినవారిలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులే ఉన్నారు. మొత్తం కేసుల్లో 25,614 మంది ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదవగా, 1,055 ఆటోలు, 5,947 కార్లు, 202 భారీ వాహనాల డ్రైవర్లపై ఉన్నాయి.
మద్యం తాగి వాహనం నడపడం వల్ల 30.7 శాతం ప్రమాదాలు జరిగాయని పోలీసులు తెలిపారు. ఇలా ఏడాది కాలంలో 210 ప్రమాదాలు జరిగాయని, సుమారు 232 మంది మరణించారని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎక్కువగా 35 ఏండ్ల లోపు వయస్సు ఉన్న యువకులే పట్టుబడుతున్నారని వెల్లడించారు.