హైదరాబాద్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ముగ్గురు టీచర్లు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు కందల రామయ్య, నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారావుకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు దక్కాయి. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేయనున్నారు. దేశ వ్యాప్తంగా 46 మంది టీచర్లను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపిక చేశారు.