నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం బెల్లాల్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.