మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లి సమీపంలో167వ జాతీయ రహదారిపై వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. దేవరకద్ర నుంచి మహబూబ్నగర్కు కారులో దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది బయల్దేరింది. అయితే కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఎంపీడీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కంప్యూటర్ ఆపరేటర్ శ్రీలత, మరో అటెండర్ ఖాజాకు గాయాలయ్యాయి. గాయపడినవారిని హుటాహుటిన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం పట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే హైదరాబాద్కు తరలించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు క్షతగాత్రులు చికిత్స పొందుతున్న మహబూబ్ నగర్ జనరల్ దవాఖానకు చేరుకుని మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డా.రాంకిషన్కు సూచించారు.