ఆదిలాబాద్ : జిల్లా పరిధిలోని ఉట్నూరు మండలం కమ్మరి తండా వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రెండు బైక్లు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. వీరిని నార్నూర్ మండలం తడిహత్నూర్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రిమ్స్లో చికిత్స పొందుతూ పెరికగూడకు చెందిన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.