భద్రాద్రి కొత్తగూడెం : మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్ (BTPS) వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన అంబోజు కృష్ణ(32), ఆయన కుమార్తె జాహ్నవి(10), కుమారుడు ప్రీతం(7) బైక్పై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే కృష్ణ, ప్రీతం ప్రాణాలు కోల్పోగా, జాహ్నవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న రేగా కాంతారావు తన వాహనాన్ని ఆపి.. ప్రత్యేక వాహనంలో మృతదేహాలను ఆస్పత్రికి పంపించారు.