కేతేపల్లి: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి క్రమంగా ఇన్ఫ్లో తగ్గుతుంది. ప్రాజెక్టు లోకి గురువారం 5918.46 ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 5775.09 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువలకు 143.37 క్యూసెక్కులు వెళుతుంది.
మొత్తం 5918.46 క్యూసెక్కుల నీరు దిగువకు వెలుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.25 అడుగులుగా (4.00 టీఎంసీలు) ఉన్నట్లు అధికారులు తెలిపారు.