హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఒక్క ఏడాదిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులు చరిత్ర సృష్టించారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, ఉచిత విద్యుత్తు తదితర అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఆకలికి ఏడ్చిన తెలంగాణ.. ఇప్పుడు అన్నపూర్ణగా మారిందని తెలిపారు. గతంతో పోల్చితే తెలంగాణ వ్యవసాయ స్వరూపం పూర్తిగా మారిందని, భవిష్యత్లో మరింత సాధికారిత సాధించాలని ఆకాక్షించారు.