సారపాక, ఆగస్టు 8 : యూట్యూబ్ చానల్లో తనపై అసత్య ప్రసారాలు చేసిన క్యూన్యూస్ చానల్ ప్రతినిధి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నతోపాటు మన తొలివెలుగు జర్నలిస్టు గంజి రఘు, మణుగూరు వాసి మహ్మద్ ఇబ్రహీంలపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరువునష్టం దావా వేశారు.
ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపారు. రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కై తప్పుడు ఆరోపణలతో చేసిన ప్రసారాలను తొలగించి బేషరతుగా లిఖితపూర్వకంగా మీడియా సమక్షంలో క్షమాపణ చెప్పాలని రేగా డిమాండ్ చేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్లు పరువు నష్టం దావా వేసినట్టు ఆయన పేర్కొన్నారు.