నిర్మల్: నిర్మల్ జిల్లాలోని (Nirmal) కడెం ప్రాజెక్టుకు (Kadem Project) భారీగా వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు (Flood water) చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి (700 అడుగులు) చేరుకున్నది. ప్రస్తుతం ఎగువ నుంచి 13,320 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో నీటిమట్టం 696.520 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిగా నిండిపోవడంతో అధికారులు 3 గేట్లు ఎత్తి (Crest Gates) 29,889 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టుకు మొత్తం 18 వరద గేట్లు ఉన్నాయి. గత నెలలో కురిసిన వానలతో కడెం జలాశయం నిండు కుండాల ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ వరద వస్తుండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తివేసే అవకాశం ఉన్నది.