హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): రెండో విడత 3.38 లక్షల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
ఇప్పటికే జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో ట్రాన్స్పోర్ట్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నదని చైర్మన్ చెప్పారు. గొర్రెల పంపిణీ కోసం ప్ర భుత్వం రూ.6,100 కోట్లను కేటాయించిందని, 73.50 లక్షల గొర్రెలు అవసరం అవుతాయని నిర్ణయించామని తెలిపారు.