హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తె లంగాణ): దేశంలో 15-24 ఏండ్ల యువతలో 29.3 శాతం మంది ఇటు చదువుకు, అటు ఉపాధికి దూరంగానే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30.2 శాతం మంది, పట్టణాల్లో 27.0 శాతం మంది ఉపాధికి, ఉపాధి శిక్షణకు నోచుకోకుండా ఉంటున్నారు. కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్వో) ఇటీవల విడుదల చేసిన మల్టిపుల్ ఇండికేటర్ సర్వే 78 రౌం డ్ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులను అధ్యయనం చేసేందుకు ఎన్ఎస్ఎస్వో 2021 ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా గ్రామాల్లో 1,64,529, పట్టణాల్లో 1,11,880 కుటుంబాలను సర్వే చేసింది. కనీస వసతులు, విద్య, బ్యాంకింగ్ తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఆ డాటాను క్రోడికరించి ఇటీవల నివేదికను విడుదల చేసింది. అం దులో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి.