హిమాయత్నగర్,నవంబర్2: గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు నిందితులు ద్విచక్రవాహనంపై తరలిస్తున్న రూ.కోటి 27లక్షల డబ్బును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. బుధవారం హైదరాబాద్ నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాకలో నివాసం ఉండే మన్నే శ్రీనివాస్ (53) , ఉస్మాన్గంజ్కు చెందిన విశ్వత్ శెట్టి (45), కేపీహెచ్బీ కాలనీలో ఉండే ఫణికుమార్(42) యాక్టివాపై (టీఎస్ 08హెచ్పీ 3299) రూ.కోటి 27లక్షల డబ్బును తరలిస్తున్నారు. ఈ విషయంపై సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ పీ రాధాకిషన్రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు సీఐ రఘునాథ్, ఎస్సై సాయికిరణ్, కానిస్టేబుల్స్ రఘు,రాజు,సతీశ్ హిమాయత్నగర్ లిబర్టీ చౌరస్తాలో ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా, రూ.1 కోటి 27లక్షల డబ్బు లభ్యమైంది. ఈ ముగ్గురి నిందితులపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.