హైదరాబాద్ : నగరంలోని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు రూ. కోటి 27 లక్షలు నగదు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ద్విచక్రవాహానాన్ని వెంబడించారు. లిబర్టీ చౌరస్తాలో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నగదు లభ్యమైందని సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గోల్నాకలో నివాసముండే మన్నే శ్రీనివాస్,ఉస్మాన్గంజ్కు చెందిన విశ్వత్శెట్టి, కేపీహెచ్బీ కాలనీకి చెందిన ఫణికుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.