నిర్మల్ అర్బన్, జనవరి 11 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మేళాలో 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. మొత్తం 257 ఎగ్జిబిట్లు ప్రదర్శించగా.. అందులో 26 ప్రదర్శనలను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ప్రతిభ కనబర్చిన భావి శాస్త్రవేత్తలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అభినందించి మెమెంటోలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు.
జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు వీరే..
జారా అఫీనా (హైదరాబాద్), చింతల నవీన్ (నల్గొండ), కే ఝాన్సీబాయి (జనగామ), ఎన్ ఆశితరెడ్డి (నాగర్కర్నూల్), ఎం సాన్విత (నల్లగొండ), ఏ రమ్యకృష్ణ (నిర్మల్), ఈ సిద్ధు (నిజామాబాద్), కే శ్రీసమర్థ (రాజన్న సిరిసిల్ల), బీ శైలజ (సిద్దిపేట), ఈ స్వాతి (వికారాబాద్), ఎం విఘ్నేష్కుమార్ (యాదాద్రి భువనగిరి), పండుగ సహస్ర (రాజన్న సిరిసిల్ల), మహ్మద్ ఖాసిఫ్ (ఆదిలాబాద్), సిరిపురం ఆసిత (హనుమకొండ), నాగరాజు (హైదరాబాద్), వీ తేజస్విని (కామారెడ్డి), జీ మణిప్రసాద్ (మంచిర్యాల), కందుల కుషీంద్ర వర్మ (మంచిర్యాల), ఎం నందిని (మెదక్), మహ్మద్ అఫ్రీన్ (ములుగు), డీ హర్షిత (పెద్దపల్లి), జంకు శ్రీనిధి (రాజన్న సిరిసిల్ల), వీ ఉమాదేవి (రంగారెడ్డి), కే పూజ (వికారాబాద్), పీ ధర్మేశ్ (వనపర్తి), సూర గణేశ్ (వరంగల్) ఎంపికయ్యారు. త్వరలో జరిగే జాతీయ స్థాయి ఇన్స్పైర్ మేళాలో వీరి ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు.