హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగియడంతో మెయిన్స్కు కటాఫ్ మార్కుల మీదే చర్చ నడుస్తున్నది. మెయిన్స్కు ఎంతమందిని ఎంపికచేస్తారనే చర్చ సైతం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్కు ఎంపికచేస్తామని టీఎస్పీఎస్సీ సోమవారం ప్రకటించింది. జీఏడీ జీవో నంబర్-55 ప్రకారం ఎంపికచేస్తామని వెల్లడించింది. దీంతో 503 పోస్టులకు 25,150 అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల తర్వాత గంపగుత్తగా కాకుండా.. అర్హతలు, మల్టీజోన్, రోస్టర్ రిజర్వేషన్ను బట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడతామని కమిషన్ వర్గాలు తెలిపాయి.
ఎంపిక ఇలా ఉండవచ్చు..
మార్కుల చింత వద్దు..
ప్రిలిమ్స్ పేపర్ సివిల్స్ స్థాయిలో రావటంతో చాలా మంది కటాఫ్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే గ్రూప్ -1కి క్వాలిఫైయింగ్ మార్కులేవీ ఉండవని టీఎస్పీఎస్సీ అధికారులు స్పష్టంచేశారు. అంటే 100కు 35 మార్కులొస్తే పాస్ అయినట్టుగా అర్హత మార్కులు ఉండవని వెల్లడించారు. పేపర్ కఠినంగా ఉండటంతో అందరికీ కఠినంగానే ఉంటుంది. దీని ప్రభావం అందరిపై పడే అవకాశమున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఉదాహరణకు..