హైదరాబాద్, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ): ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత కరెంటు పథకానికి రెండేండ్లు పూర్తయాయ్యని, ఇప్పటి వరకు ప్రభుత్వం అందుకు రూ.120 కోట్లను ఖర్చు చేసిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు శనివారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఉచిత విద్యుత్తు పథకం ద్వారా 1,07,457 మంది రజకులు, నాయీబ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. రజక, నాయీబ్రాహ్మణుల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.