హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో మరో 25 ఆర్టీసీ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఆగస్టు నెలాఖరు నాటికి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఏసీ బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. త్వరలో రాణిగంజ్, హయత్నగర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కూకట్పల్లి డిపోల్లో విద్యుత్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.