హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అంబేద్కర్-కోనసీమ జిల్లా అంకంపాలెంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారక స్థితిలోకి చేరుకోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
కార్తిక వనభోజనానికి గ్రామస్థులు సమీప తోటలోకి వెళ్లారు. వంటచేసిన అనంతరం భోజనం చేస్తుండగా ఒక్కసారిగా తేనేటీగలు దాడి చేశాయి.