సంగారెడ్డి : పటాన్చెరు బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో టీచర్లు ఆందోళనకు గురయ్యారు. వీరిలో ముగ్గురికి తీవ్ర అస్వస్థత కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ 25 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని వైద్యులు చెప్పారు.
పటాన్ చెరు బీసీ గురుకుల పాఠశాలలో ఇప్పటికే 47 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వాంతులు, విరేచనాలు అయిన 25 మంది బాలికలకు ఇటీవల కొవిడ్ టెస్టు నిర్వహించగా, నెగిటివ్ రిపోర్టు వచ్చింది. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.