కంపెనీకి చెక్కు అందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం ఇన్సూరెన్స్ సంస్థకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు రూ.25 కోట్ల చెక్కు అందించారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు మంత్రి చెక్కు ఇచ్చారు. పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్కు ప్రీమియా న్ని పార్టీ చెల్లించింది. కార్యక్రమంలో మం త్రులు పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్రెడ్డి, భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.