హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డూ ఇట్ యువర్సెల్ఫ్ (డీఐవై) హ్యాకథాన్ను నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మాడల్స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లోని 8-10 మంది ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ హ్యాకథాన్లో పాల్గొనవచ్చని తెలిపారు. https://schooledu. telangana. gov.in వెబ్సైట్ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.