నాడు ముళ్లపొదలు.. చెత్తాచెదారంతో అధ్వానం
నేడు ‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామం
ఊరికే కొత్తందం తెచ్చిన ప్రకృతి వనం
అందుబాటులోకి డంపింగ్ యార్డు, శ్మశానవాటిక
ప్రతి వీధిలో అద్దంలా సీసీ రోడ్డు
కమలాపూర్, ఏప్రిల్ 7: పల్లెప్రగతితో ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీకి కొత్త వెలుగులు వచ్చా యి. ఒకప్పుడు ముళ్లపొదలు, చెత్తా చెదారంతో అధ్వానంగా ఉండే ఈ ప్రాంతం.. ఇప్పుడు అభివృద్ధి పథం లో పయనిస్తోంది. అసాంఘిక కార్య కలాపాలకు అడ్డాగా మారిన వార సంత స్థలంలో ఆహ్లాదం పంచే పల్లె ప్రకృతి రూపుదిద్దుకోగా, మిగతా స్థలంలో కూరగాయల మార్కెట్ నిర్మించనున్నారు. ప్రతి వీధికి అద్దం లా మెరిసే సీసీరోడ్లు వచ్చాయి. గ్రా మానికి ప్రభుత్వం ఇలా నెలనెలా నిధులు సమకూర్చడంతో సకల సౌక ర్యాలు సమకూరాయి. ప్రభుత్వం ప్రతి నెలా ఉప్పల్ గ్రామాభివృద్ధికి రూ.7లక్షల 90వేలు ఇస్తున్నది. 6వేలకు పైగా జ నాభా ఉన్న ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీలో 12 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. పల్లెప్రగతి గ్రామానికి కొత్తందాలు తీసుకురావ డంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స ర్కారు విడుదల చేసిన నిధులు రూ.10.70 లక్షలతో శ్మశానవాటిక, రూ. 2.50లక్షలతో డం పింగ్ యార్డు నిర్మించారు. ఇటీవల డీఎంఎఫ్టీ జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇచ్చిన రూ.80 లక్షల నిధులతో ప్రధాన చౌరస్తా నుంచి రైల్వే స్టేష న్కు డబుల్ బీటీ రోడ్డు, అలాగే ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కు సీసీరోడ్డు నిర్మించారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక, పల్లె ప్రకృతి వనం ఎదురుగా సా మాజిక మరుగుదొడ్లు నిర్మించి ప్రజలకు అందు బాటులోకి తెచ్చారు.
ఆహ్లాదం పంచుతున్న పల్లెప్రకృతి వనం..
ఉప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వెనుకాల రైల్వే స్టేషన్కు వెళ్లే దారి ఒకప్పుడు ముళ్లపొదలతో నిండిపోయి చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లేది. ప్రయాణికులు రైల్వే స్టేషన్, బస్టాండ్కు వెళ్లాలంటే భయపడేది. నేడు అదే స్థలంలో ముళ్లపొదలు తొ లగించి ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మొక్కల పెంపకంతో పట్టణాల్లోని పార్కును(గార్డెన్) తలపి స్తున్నది. నాడు దుర్గంధం వెదజల్లిన స్థలమే నేడు పచ్చని మొక్కలతో అహ్లాదాన్నిస్తున్నది. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తూ గ్రామస్తులు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. పల్లె ప్రకృతి వనంలో వాకింగ్ చేస్తూ సంబుర పడుతున్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం..