దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
భూత్పూర్, మార్చి 29 : దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందజేస్తామని ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం అన్నాసాగర్లో ఎమ్మెల్యే ఆల ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. చిన్నరాజమూరులో నిర్మిస్తున్న చెక్డ్యాంతోపాటు చిన్నచింతకుంట మండలంలోని ఊకచెట్టు వాగు, అడ్డాకుల మండలంలోని కందూరు వాగుల్లో చేపట్టిన చెక్డ్యాంల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలంలో నీరు వృ థా కాకుండా చూడాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తనతో దృష్టికి తీసుకురావాలని తెలిపారు. చెక్డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపుతున్నందున అధికారు లు బాధ్యతగా పని చేయాలని కోరా రు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ చందులాల్, ఏఈఈ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
నియోజకవర్గంలోని డోకూరు గ్రామానికి చెందిన మంజులకు మంజూరైన రూ.27వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అన్నాసాగర్లో ఎమ్మెల్యే అందజేశా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌ డ్, గోప్లాపూర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆలయ చైర్పర్సన్గా రాధిక
దేవరకద్ర రూరల్, మార్చి 29 : మండల ప్రజల ఆరాధ్యదైవం ఈశ్వరవీరప్పయ్యస్వామి ఆలయ చైర్పర్సన్గా కొం డా రాధిక నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కొత్త చైర్పర్సన్కు నియామకపత్రాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్పర్సన్ రాధిక తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, కొండా భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.