సంగారెడ్డి : రాష్ట వ్యాప్తంగా 20 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చామని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
జిల్లాలోని జహీరాబాద్ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసిందన్నారు.
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి స్పష్టం చేశారు. జహీరాబాద్ లో 50 పడకల మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
అలాగే జహీరాబాద్ ప్రాంతీయ దవాఖాన సౌకర్యాల కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
జహీరాబాద్లో సాధారణ ప్రవవాలను 75 శాతం పెంచాలని ఆయన సూచించారు. సంగారెడ్డి, జహీరాబాద్ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీలు పెరగడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కొద్దిగా కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు.
ప్రజలందరూ నిబంధనలు పాటించాలి. కరోనా థర్డ్ వేవ్ నుంచి బయట పడితే ఎప్పటిలాగే సంక్షేమ పథకాలు మరింత ముందుకు సాగుతాయన్నారు. జహీరాబాద్ దవాఖానకు బ్లడ్ స్టోరేజీ లేదా బ్లడ్ బ్యాంర్ను మంజూరు చేస్తామని మంత్రి హామీనిచ్చారు.