సూర్యాపేటటౌన్, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కార్మికులకు అండగా నిలుస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలో సీఐటీయూ నుంచి సుమారు 200 మంది మున్సిపల్ కార్మికులు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కాకముందు కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, 2014 తర్వాత సీఎం కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులకు 30 శాతం పీఆర్సీ అమలు చేశారని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, భద్రత లేదని అన్నారు. గుజరాత్లో రైతులకు ఉచిత విద్యుత్తు, సంక్షేమ పథకాలు లేవని చెప్పారు. కానీ బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు పన్నుతూ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేటలో ఈఎస్ఐ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.