శంషాబాద్ రూరల్, మే 24: శంషాబాద్ ఎయిర్పోర్టులో బ్యాటరీ రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అధికారులు బుధవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1.81 కోట్ల విలువ చేసే 2.915 కిలో గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటలకు దుబాయ్ నుంచి శంషాబాద్కు వచ్చిన ఎమిరేట్స్ ఈకే -524 విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించాడు.
కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు అతడిని సోదా చేయగా, ఎమర్జెన్సీ లైట్ లభించింది. ఆ లైట్ గురించి ఆరా తీయగా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో లైట్ను తెరిచి చూడగా నలుపురంగు కవర్లో బ్యాటరీ మాదిరిగా సుమారు మూడు కిలోల బంగారం కనిపించింది. నిందితుడిని ఏపీకి కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పాదాల అడుగున ముగ్గురు వ్యక్తులు రూ.1.13 కోట్ల విలువైన బంగారాన్ని పేస్టు రూపంలో అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.