హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు పదా అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి శ్రీశైలానికి 2,80,349 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,27,325 క్యూసెక్కుల వరద బయకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.