హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడ కుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయా లని సీఎం కేసీఆర్ నిర్ణయించారని సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ చె ప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆం దోళన చెందొద్దని కోరారు. కొనుగోలు కేం ద్రాల్లో ఏవైనా సమస్యలుంటే 1967, 1800425 00333 ఫోన్ నంబర్లలో ఫిర్యా దు చేయవచ్చని రైతులకు సూచించారు. అవ సరమైతే తనకు కూడా నేరుగా ఫోన్ చేయ వచ్చని తెలిపారు. బుధవారం పౌరసరఫ రాల భవన్లో ధాన్యం కొనుగోళ్లపై అధికా రులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మ న్ మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రవ్యా ప్తంగా లక్ష మంది రైతుల నుంచి రూ.1,710 కోట్ల విలువైన 8.30 లక్షల టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. అకాల వర్షా లను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరగకుండా కొన్న ధాన్యాన్ని ఎప్ప టికప్పుడు తరలించాలని ఆదేశించారు.