నల్లగొండ : నిన్న బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి. అయితే నగదుతో పట్టుబడ్డ కారు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిదని తెలుస్తోంది. ఆ కారులో నగదుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, కండువాలు లభ్యమైనట్లు సమాచారం. పట్టుబడ్డ రూ. 19 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.
ఈ నగదుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్లే దారిలో ఈ వాహనాన్ని పోలీసులు ఆపి చెక్ చేయగా, డబ్బులు బయటపడ్డాయి. TS 07 FY 9333 బ్రీజా కారులో తరలిస్తున్న రూ. 19 లక్షలను సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నగదు పట్టుబడ్డ వాహనంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు, ఫ్లెక్సీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.